Allu Arjun మల్టీస్టారర్​ బిజినెస్​!

Hyderabad: ఇద్దరు స్టార్​ హీరోలు కలిసి నటిస్తే మల్టీస్టారర్​ సినిమా అవుతుంది. అలాగే ఇద్దరు స్టార్లు కలిసి బిజినెస్​ చేస్తే అదే మల్టిస్టారర్​ బిజినెస్​. అలాంటి ఓ మల్టీస్టారర్ బిజినెస్ చేయడానికి చేతులు కలపబోతున్నారు మన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), బాలీవుడ్(Bollywood) హీరో అభిషేక్ బచ్చన్(Abhishek Bachan).
బాలీవుడ్ బిగ్​ బి అమితాబ్ బచ్చన్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అభిషేక్ బచ్చన్ కి కూడా బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. స్టార్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్(Aishwarya Rai) భర్త అయిన అభిషేక్ బచ్చన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. మరోవైపు ‘పుష్ప’ సినిమాతో బాలీవుడ్ లో అల్లు అర్జున్ క్రేజ్ కూడా బీభత్సంగా పెరిగింది. తాజాగా ఇప్పుడు వీరిద్దరూ కలిసి బిజినెస్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒక స్పోర్ట్స్ బిజినెస్ మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారట.
ఇప్పటికే అభిషేక్ బచ్చన్ జైపూర్ పింక్ పాంథర్స్ అనే కబడ్డీ టీం, చెన్నైన్​ ఎఫ్ సీ అనే ఫుట్ బాల్ టీం లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ కూడా సత్యం థియేటర్ ను ఏషియన్ గ్రూప్ వారితో చేతులు కలిపి మాల్​గా మార్చారు. అయితే తాజాగా ఇప్పుడు అల్లు అర్జున్ అభిషేక్ బచ్చన్ తో కలిసి ఒక స్పోర్ట్స్ బిజినెస్ చేయడానికి నిర్ణయించుకున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన, వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారట. దీంతో బన్ని బిజినెస్​ మ్యాన్​గా మారనున్నారంటూ ఇప్పటికే నెట్టింట చర్చ మొదలైంది. ఇక, బన్ని ప్రస్తుతం పుష్ప2(Pushpa2) సినిమా షూటింగ్​తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.