Pothina Mahesh: జ‌గ‌న్ ఓడిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అదే

Pothina Mahesh suggestion to cbn pawan kalyan

Pothina Mahesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ద‌గ్గ‌ర ట్యూష‌న్‌కి వెళ్లాల‌ని అన్నారు పార్టీ నేత పోతిన మ‌హేష్‌. ఈరోజు రాష్ట్రం అప్పుల పాలైపోయింద‌ని.. సూప‌ర్ సిక్స్ అమ‌లు చేయాలంటే భ‌య‌మేస్తోంద‌ని మొన్న అసెంబ్లీలో చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

దీనిపై పోతిన మ‌హేష్ స్పందిస్తూ.. భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని.. చంద్ర‌బాబు, ప‌వ‌న్, పురంధేశ్వ‌రి క‌లిసి ప‌థ‌కాలు ఎలా అమ‌లు చేయాలో జ‌గ‌న్ ద‌గ్గ‌ర ట్యూష‌న్ తీసుకుంటే స‌రిపోతుంద‌ని సెటైర్ వేసారు. మాట్లాడితే జ‌గ‌న్ భ‌య‌ప‌డి అసెంబ్లీకి రావ‌డం లేదు అని అంటున్నార‌ని.. ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌కుండా ఎవ‌రు భ‌య‌ప‌డుతున్నారో ప్ర‌జ‌ల‌కు తెలుస్తోంద‌ని అన్నారు. అబ‌ద్ధాలు చెప్ప‌డం తెలీక‌.. త‌ప్పుడు ప‌థ‌కాలు ఇవ్వ‌డం రాక‌పోవ‌డం వ‌ల్లే జ‌గ‌న్ ఎన్నిక‌ల్లో ఓడిపోయార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

స‌చిన్ తెందుల్క‌ర్, రాహుల్ ద్రావిడ్ వంటి పెద్ద పెద్ద క్రికెట‌ర్లు కూడా చాలా మ్యాచ్‌ల‌లో ఓడిపోయి ఈరోజు క్రికెట్ రంగంలో లెజెండ్స్‌గా నిలిచార‌ని.. అదే విధంగా ఈసారి జ‌గ‌న్‌ను ప్ర‌జ‌ల‌కు బ‌లంగా ఆద‌రిస్తార‌ని అన్నారు.