Payyavula Keshav: శాంతి భ‌ద్ర‌త‌లు లేవా.. “శాంతి”కే భ‌ద్ర‌త లేదా?

Payyavula Keshav satires in jagan mohan reddy

Payyavula Keshav:  రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు లేవు అంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించారు మంత్రి ప‌య్యావుల కేశ‌వ్. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌తలు లేవా? లేక శాంతికే భ‌ద్ర‌త లేదా అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.

“” జ‌గ‌న్ గారి రాజ‌కీయ జీవితంలో అగమ్య‌గోచ‌రంగా మారింది. ఆయ‌న‌పై ఉన్న కేసుల‌ను తెర‌వ‌బోతున్నారు. ఇక కోర్టుల చుట్టూ తిర‌గాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. దాంతో త‌న‌కు క‌నీసం ఇండియా కూట‌మి నుంచైనా మ‌ద్ద‌తు రాక‌పోదా అని నేరుగా ఢిల్లీ వెళ్లారు. ఆ విష‌యం ధైర్యంగా చెప్ప‌లేక రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు లేవ‌ని అంటున్నారు.ఇందాక ఎవ‌రో నాతో అన్నారు. జ‌గ‌న్ గారు కూడా అదే అంటున్నారు శాంతికి భ‌ద్ర‌త లేదు అని. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 36 మంది చ‌నిపోయారు అంటున్నారు.

వారి వివ‌రాలు మాత్రం బ‌య‌ట‌పెట్ట‌డంలేదు. ఢిల్లీకి వెళ్లాడు. క‌నీసం అక్క‌డ కూడా ఆ 36 మంది జాబితాను చెప్ప‌లేదు. స‌మ‌స్య‌ల‌ను అసెంబ్లీకి వ‌చ్చి చెప్ప‌మంటే సింగిల్ కెమెరాతో కేవ‌లం త‌న‌ని తాను చూపించుకుంటూ ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్‌మీట్‌కి హాజ‌ర‌య్యే వారిని స్థ‌లం లేక‌పోవ‌డంతో కెమెరాలు తీసుకురావ‌ద్ద‌ని చెప్పాడ‌ట‌. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్ చూస్తే మైసూరు మ‌హారాజ ప్యాలెస్ అంత విశాలంగా ఉంది “” అంటూ సెటైర్లు వేసారు.