Amit Mishra: ధోనీ, కోహ్లీ వ‌ల్లే నా కెరీర్ ఆగిపోయింది

Amit Mishra says his career has been put off by virat kohli and ms dhoni

Amit Mishra: ఎం ఎస్ ధోనీ, విరాట్ కోహ్లీల వ‌ల్లే త‌న కెరీర్ ఆగిపోయింద‌ని వాపోయారు క్రికెట‌ర్ అమిత్ మిశ్రా. అనిల్ కుంబ్లే ఉన్న స‌మ‌యంలో అమిత్ మిశ్రా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత కోహ్లీ, ధోనీ కెప్టెన్సీ స‌మ‌యంలో కూడా ఆడాడు. అమిత్ 22 టెస్ట్ క్రికెట్లు, 36 ODIలు, 10 T20Iలు ఆడి మొత్తం 156 వికెట్లు తీసాడు. కాక‌పోతే ఆయ‌న‌కు జ‌రిగిన గాయం వ‌ల్ల కెరీర్ ముందుకు వెళ్ల‌లేక‌పోయింది.

అయితే గాయం నుంచి కోలుకుని బాగా ఆడుతున్న‌ప్ప‌టికీ మిశ్రా చాలా మ‌టుకు మ్యాచ్‌ల‌కు సెలెక్ట్ అయ్యేవాడు కాదు. ఇదే విష‌యాన్ని మిశ్రా ధోనీని అడ‌గ్గా.. టీమ్ కాంబినేష‌న్‌లో స‌రిపోవు అని చెప్పేవాడ‌ట‌. ఆ త‌ర్వాత కోహ్లీ కెప్టెన్సీ స‌మ‌యంలోనూ నిరుత్సాహ‌మే ఎదురైంది. మిశ్రాకు అడ‌గ‌కున్నా కూడా రెస్ట్ ఇచ్చేవార‌ట‌. దాంతో మిశ్రా కోహ్లీని సంప్ర‌దించ‌గా స‌రైన స‌మాధానం వ‌చ్చేది కాద‌ట‌. దాంతో మిశ్రా కెరీర్ అర్థాంత‌రంగా ముగిసిపోయింది. ఇప్ప‌టికీ కోహ్లీ, ధోనీల పేర్లు గుర్తుస్తే త‌న‌కు కెరీర్ నాశ‌నం అయిపోయింది వీరి వల్లే క‌దా అని అనిపిస్తూ ఉంటుంద‌ని మిశ్రా ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపాడు.