Viral News: మాయ‌మాట‌లు చెప్పి చెల్లిని లొంగదీసుకున్న అన్న‌

brother elopes with sister in karnataka

Viral News: మాయమాటలు చెప్పి చెల్లిని అన్న లొంగతీసుకున్న ఘ‌ట‌న మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో చోటుచేసుకుంది. క‌ర్ణాట‌క‌లోని ఓ గ్రామానికి చెందిన ఓ మహిళకు ఇద్దరు భర్తలున్నారు. మొదటి భర్తతో ఒక కుమారుడు, రెండో భర్తతో ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం ఆమె తన నలుగురు పిల్లలతో కలిసి మహబూబ్ నగర్‌కు వచ్చి స్థిరపడింది. గ్రెనేట్ రాయి కొట్టేందుకు ఆమె కుమారుడు (21) బిజినేపల్లి మండలంలోని ఓ తండాకు ముగ్గురు చెల్లెళ్లతో కలిసి వచ్చాడు.

ఈ క్రమంలో మూడు నెలల క్రితం రెండో చెల్లెలి (15)కి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. సోదరితో సన్నిహితంగా మెలుగుతుండడాన్ని తల్లి గుర్తించి మందలించింది. తప్పుడు పనులు చేయొద్దంటూ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో గత నెల ఒకటిన ఇంట్లో నుంచి ఇద్దరు కలిసి వెళ్లిపోయారు. 10 రోజులు గడిచినా వారు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో వనపర్తి జిల్లా ఘన్‌పూర్ మండలంలోని బలిజపల్లి గ్రామంలో వారిద్దరూ అనుమానాస్పదంగా కనిపించడంతో గ్రామస్థులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం ఇచ్చారు. అధికారులు వారిద్దరినీ విచారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.