Madan Mohan: విజ‌య‌సాయి రెడ్డి DNA టెస్ట్‌కి రావాల్సిందే

Madan Mohan alleges vijaya sai reddy might harm her wife shanti

Madan Mohan: వైఎస్సార్ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత విజ‌య సాయిరెడ్డి వ‌ల్ల త‌న భార్య శాంతికి ప్రాణ‌హాని ఉంద‌ని ఆరోపించారు మ‌ద‌న్ మోహ‌న్. దేవ‌దాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ శాంతిపై ఆమె భ‌ర్త మ‌ద‌న్ మోహ‌న్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసారు. ఆయ‌న దుబాయ్‌లో ఉద్యోగం చేస్తుంటే ఆమె గ‌ర్భం ఎలా దాల్చింద‌ని.. దీని వెనుక విజ‌య‌సాయి రెడ్డి హ‌స్తం ఉంద‌ని అనుమానంగా ఉంద‌ని ఆరోపించారు. మ‌రోప‌క్క శాంతి ఈ ఆరోప‌ణ‌ల‌న్నీ త‌ప్పని.. మ‌ద‌న్ మోహ‌న్‌తో త‌న‌కు విడాకులు అయ్యాక తాను సుభాష్ అనే వేరొక‌రిని పెళ్లి చేసుకున్నానని.. అత‌ని ద్వారానే త‌ల్లిని అయ్యాన‌ని చెప్పారు.

దీనిపై మ‌ద‌న్ మోహ‌న్ ప్రెస్‌మీట్ పెట్టారు. విజయసాయి రెడ్డి నుంచి శాంతికి ప్రాణహాని ఉందని ఆమె ప్రాణానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాన‌ని అన్నారు. తన భార్యకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని ఓ పేదవాడిగా పోరాటం చేస్తున్నానని ఆయన చెబుతున్నారు. త‌న భార్య‌కు పుట్ట‌బోయే బిడ్డ‌కు తండ్రి ఎవ‌రో తెలిసే వ‌ర‌కు నిరాహార దీక్ష చేస్తాన‌ని అన్నారు. విజ‌య సాయిరెడ్డి డీఎన్ఏ ప‌రీక్ష‌కు హాజ‌రుకావాల్సిందే అని ఆయ‌న ఆ బిడ్డ‌కు తండ్రి కాదు అని తెలిస్తే సాష్టాంగ న‌మ‌స్కారం చేసి మ‌రీ క్ష‌మాప‌ణ‌లు చెప్తాన‌ని తెలిపారు.