విదేశాల్లో భర్త.. గర్భం దాల్చిన దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్.. ఎంపీ విజ‌య‌సాయి రెడ్డిపై అనుమానం

With her husband abroad, Assistant Commissioner of Endowments Department becomes pregnant

Amaravathi: భర్త విదేశాల్లో ఉండ‌గా.. దేవ‌దాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ అయిన శాంతి గ‌ర్భం దాల్చ‌డం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని అమ‌రావ‌తిలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దాంతో శాంతి భ‌ర్త మదన్ మోహన్.. దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య శాంతి గ‌ర్భం దాల్చిందని ఆ అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ దేవదాయ శాఖ కమిషనరును కోరుతూ లేఖ రాసారు. తన భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ లే కారణమనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ భర్త మదన్ మోహన్ కంప్లైంట్ ఇవ్వ‌డం వివాదాస్ప‌దంగా మారింది. దాంతో ఇటీవలే శాంతిని దేవదాయ శాఖ కమిషనర్ స‌స్పెండ్ చేసారు.