Chandrababu Naidu: నాకు ప్రాణ భిక్ష పెట్టింది వెంక‌టేశ్వ‌ర‌స్వామి

Chandrababu Naidu says he si alive because of venkateswara swamy

Chandrababu Naidu: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మంగ‌ళగిరిలో ప‌ర్య‌టించారు. అనంత శేష స్థాప‌న కార్య‌క్ర‌మంలో భాగంగా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ.. వెంక‌టేశ్వ‌ర స్వామి అంటే త‌న‌కు గుర్తొచ్చేది త‌న‌కు ప్రాణ‌భిక్ష పెట్టిన క‌లియుగ దైవం అని అన్నారు. అలిపిరిలో త‌న వాహ‌నంపై ల్యాండ్ మైన్స్ పేల్చిన‌ప్పుడు తెలుగు ప్ర‌జ‌ల‌కు ఇంకా ఏదో చేయాల‌నే వెంక‌టేశ్వ‌ర స్వామి త‌న‌ను బ‌తికించార‌ని తెలిపారు.