నంద్యాల‌లో దారుణం.. బాలిక‌పై సీనియ‌ర్లు గ్యాంగ్ రేప్.. ఇంకా దొర‌క‌ని శవం

8 year old girl gang raped by seniors in nandyal

Nandyal: ఆంధ్రప్ర‌దేశ్‌లోని నంద్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 8 ఏళ్ల బాలిక‌పై ముగ్గురు సీనియ‌ర్లు గ్యాంగ్ రేప్‌కు పాల్ప‌డ్డారు. ఆ త‌ర్వాత బాలిక‌ను చంపేసి కాలువ‌లో ప‌డేసారు. ముచ్చుమ‌ర్రి ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలురు స్థానిక పాఠ‌శాల‌లో చ‌దువుతున్నారు. అదే పాఠ‌శాల‌లో చ‌దువుతున్న బాలిక మైదానంలో ఆడుకుంటుండ‌గా.. మేం కూడా ఆడ‌తాం అంటూ ఆమెతో చేరారు. ఆ త‌ర్వాత బాలిక‌కు మాయ‌మాట‌లు చెప్పి ఎవ్వ‌రూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసారు. ఆ త‌ర్వాత బాలిక ఎక్క‌డ త‌ల్లిదండ్రుల‌కు చెప్తుందో అని చంపేసి దగ్గ‌ర్లోని కాలువ‌లో శ‌వాన్ని ప‌డేసి వెళ్లిపోయారు. ఆ త‌ర్వాత బాలిక త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా.. స్నిఫ‌ర్ డాగ్స్ సాయం ద్వారా పోలీసులు నిందితుల‌ను ప‌ట్టుకున్నారు. అయితే బాలిక శ‌వం మాత్రం ఇంకా దొర‌క‌లేద‌ని పోలీసులు తెలిపారు.