KTR: పార్టీ మారేవారిని రాళ్ల‌తో కొట్టి చంపాల‌న్న‌ది రేవంతే క‌దా..!

KTR questions rahul gandhi about anti defection law

KTR: పార్టీ మారేవారిని రాళ్ల‌తో కొట్టి చంపాల‌ని పిలుపునిచ్చింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే అని అన్నారు భార‌త రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈరోజు ఆయ‌న ఢిల్లీ మీడియాతో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఒక పార్టీ ఎమ్మెల్యేలు మ‌రో పార్టీలోకి జంప్ అవ్వ‌కుండా యాంటి డిఫెక్షన్‌లా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తుచేసారు. ఇప్పుడు వలసలను ప్రోత్సహించేది కూడా కాంగ్రెస్ పార్టీనే అని విమ‌ర్శించారు.

“” వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. డిసెంబర్ 9న రుణ మాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేరలేదు. కాంగ్రెస్ ఆరు గారెంటేలు మర్చిపోయి ఆరుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలను చేర్చుకుంది. రాజ్యాంగ ఉల్లంఘానకు పాల్పడుతున్నారు. గోవా, కర్ణాటక లో బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని రాహుల్ చెప్పుకుంటూ… ఇప్పుడు తెలంగాణాలో BRS ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు.

మణిపూర్ లో ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే.. ఆ ఎమ్మెల్యే నీ సుప్రీం కోర్టు డిస్ క్వాలిఫై చేసింది. ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీ పార్టీ ఫిరాయిస్తే వారిని డిస్ క్వాలిఫై అయ్యేలా చట్టం తీసుకురావాలని రాహుల్ గాంధీ చెప్పారు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చూపిస్తారు కానీ ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వరు. పార్టీ మారే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని గతంలో రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ లో ఎమ్మెల్యేలను ఎన్ని కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు?
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను డిల్లీలో బయటపెడతం. పార్టీ మారే ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకుంటే పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టుకి వెళ్తాం. పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రపతి కి ఫిర్యాదు చేస్తాం “” అని వెల్ల‌డించారు.