Jagan: ఈరోజు మీరు కొట్టారు.. రేపు అధికారంలోకి వ‌చ్చాక మేం కొడితే?

jagan mohan reddy warns chandrababu naidu in pulivendula

Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పులివెందుల‌కు చేరుకున్నారు. తెలుగు దేశం పార్టీ కార్య‌క‌ర్త‌ల దాడిలో గాయ‌ప‌డిన వైఎస్సార్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ను స్థానిక హాస్పిట‌ల్‌లో ప‌రామ‌ర్శించారు.

అనంతరం జ‌గన్ మీడియాతో మాట్లాడుతూ.. “” చంద్ర‌బాబు గారూ.. నేను మ‌ళ్లీ హెచ్చ‌రిస్తున్నారు. ఈరోజు మీరు చెడు రాజ‌కీయాల‌కు బీజం వేస్తున్నారు. ఎల్ల‌కాలం అధికారంలో మీరే ఉండ‌రు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నార‌ని మావాళ్ల‌ను కొడుతున్నారు. రేపు మేం అధికారంలోకి వ‌చ్చాక మా వాళ్లు కొడితే దానికి బీజం వేసిన వారు మీరే అవుతారు. ఏం త‌ప్పు చేసాడ‌ని ఆ పిల్లాడిని కొట్టారు? కేవ‌లం మీకు ఓటేయ్య‌నందుకు ఇలా కొడ‌తారా? మేం గెలిచిన‌ప్పుడు మాకు ఓట్లు వేయ‌ని వారిని మేం ఎన్న‌డూ కొట్టింది లేదు. మాకు రావాల్సిన ప‌ది శాతం ఓట్లు మీ వైపుకు మ‌ళ్లాయంటే అది మీరు మ‌భ్య‌పెట్టే హామీలు ఇవ్వ‌డం వ‌ల్లే అని గుర్తుంచుకోండి “” అని తెలిపారు.