YS Sharmila: మీరు మీ చెంచాలు ఏం సాధిస్తారు?

ys sharmila says modi is running fascist government

YS Sharmila: మీరు మీ చెంచాలు ఏం సాధిస్తారు అని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని ప్ర‌శ్నించారు APCC చీఫ్ వైఎస్ ష‌ర్మిళ‌. పార్లమెంట్‌లో అపోజిష‌న్ లీడ‌ర్ రాహుల్ గాంధీ న‌రేంద్ర మోదీ మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగిన నేప‌థ్యంలో ష‌ర్మిళ ట్వీట్ చేసారు.

“”” ఝూట్ బోలో, బార్ బార్ ఝూట్ బోలో ” అంటూ పార్లమెంట్ ను అబద్దాల కార్ఖానాగా నడుపుతూ, మాటిమాటికీ, ముమ్మాటికీ దేశ ప్రజలను మభ్యపెడుతూ, సంస్కారం, విచక్షణ కోల్పోయి సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా ఫాసిస్టు పాలన నడుపుతున్న నరేంద్ర మోదీ గారు. మీకో సూటి ప్రశ్న. వీరోచిత పోరాటపటిమ, అద్భుత వాగ్ధాటి, మనసా వాచా కర్మణా దేశం, ప్రజల కోసమే నిలబడే నిస్వార్థ చింతన, ఇలాంటి లక్షణాలు నింపుకున్న రాహుల్ గాంధీ గారిని అవమానిద్దామనుకుని, అడ్డుకుంటూ, అయన దిష్టి బొమ్మలను కాల్పించే నీచ సంస్కృతితో ఏమి సాధిస్తారు మీరు, మీ పార్టీ చెంచాలు! ఆకాశం మీద ఉమ్మితే మీ మీదే పడుతుందని మర్చిపోతున్నారు.

మీ నీచ రాజకీయాలు, మోసపూర్తి చర్యలు, ప్రజల గుండెల్లో విషం నింపే కుట్రపూరిత కోరలు, ఇవన్నీ యావత్ దేశం గమనిస్తోంది, మీ మాయమాటలతో మోసపోయేంత అమాయకులు కారు ప్రజలు. మణిపూర్ నరమేధంతో తరతరాల భవితకు సర్వనాశనం జరుగుతుంటే పర్యటించలేని పిరికి ప్రభుత్వం మీది. మీరా దేశానికి మంచి చేసేది, మీరా రాజ్యాంగం గురించి మాట్లాడేది. దిష్టి బొమ్మలే కాదు, గోద్రా, మణిపుర్లు కూడా తగలబెట్టించిన నైజము మోదీది. ఐక్యత, ప్రేమ, శాంతి, సోదరాభావం కోసం వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఘనత రాహుల్ గాంధీ గారిది “”” అని ట్వీట్ చేసారు.