IND vs ENG: క‌న్నీరుపెట్టిన కోహ్లీ.. రాహుల్ ద్రావిడ్ ఓదార్పు

rahul dravid consoles virat kohli

IND vs ENG: నిన్న గుయానాలో టీమిండియా ఇంగ్లాండ్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఎట్ట‌కేల‌కు మ‌న‌మే గెలిచిన‌ప్ప‌టికీ.. విరాట్ కోహ్లీ చేసిన సింగిల్ డిజిట్ స్కోర్ మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. 9 ప‌రుగుల‌కే ఔట్ అయిన కోహ్లీ డ్రెస్సింగ్ రూంకి వెళ్లి కంట‌త‌డి పెట్టుకున్నాడు. దాంతో టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ కోహ్లీని ఓదార్చారు. గుయానా పిచ్‌పై కోహ్లీ చాలా క‌న్‌ఫ్యూజ్ అయ్యాడు. ఈ టోర్న‌మెంట్‌లో కోహ్లీ చేసిన ఐదో సింగిల్ డిజిట్ స్కోర్ ఇది. ఈ టోర్న‌మెంట్‌లో కోహ్లీ ఇచ్చిన బెస్ట్ పెర్ఫామెన్స్ ఏద‌న్నా ఉందంటే అది బంగ్లాదేశ్ మ్యాచ్ స‌మ‌యంలో. ఆ మ్యాచ్‌లో కోహ్లీ 37 ప‌రుగులు తీసాడు.