Jagan Mohan Reddy: న‌న్ను చ‌చ్చేదాకా కొట్టాల‌న్న‌ది మీరే.. అయ్య‌న్న‌పాత్రుడికి జ‌గ‌న్ లేఖ‌

Jagan Mohan Reddy letter to ap assembly speaker ayyannapatrudu

Jagan Mohan Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడికి లేఖ రాసారు. కొన్ని రోజుల క్రితం ఓ సీనియ‌ర్ నేత‌తో క‌లిసి జ‌గ‌న్‌కు 40 శాతం ఓట్లు ప‌డ్డాయి. చ‌చ్చేదాకా కొట్టాలి అని వ్యాఖ్యానించిన వీడియో సోష‌ల్ మీడియాలో దుమారం రేపింది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ అయ్య‌న్న‌పాత్రుడికి లేఖ రాసారు.

“” ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారు . ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. పార్లమెంటులో కాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోకాని ఈ నిబంధన పాటించలేదు. అధికార కూటమి, స్పీకర్‌ ఇప్పటికే నాపట్ల శతృత్వానికి ప్రదర్శిస్తున్నారు. చచ్చేదాకా కొట్టాలంటూ మీరు మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయి. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడంలేదు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లేఖను పరిశీలించాలని కోరుతున్నాను “” అని లేఖ‌లో పేర్కొన్నారు.