Avinash Reddy: ఇంట్లో వాళ్లు అవ‌మానించినా.. ప్ర‌జ‌లు ఆద‌రించారు

MP YS Avinash Reddy Shocking Comments On YS Sharmila And Sunitha

Avinash Reddy:  ఇంట్లో వాళ్లు త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తూ న‌లుగురిలో త‌న‌ను అవ‌మానించినా.. ఎంపీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు త‌న‌ను మ‌ళ్లీ మూడోసారి ఆద‌రించార‌ని అన్నారు క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్ప‌టికీ రాష్ట్రానికి కావాల్సిన అన్ని అంశాల‌పై పార్ల‌మెంట్‌లో బ‌లంగా పోరాడ‌తాన‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం క‌డ‌ప‌లో నిర్మితం అవుతున్న ఎయిర్‌పోర్ట్ ట‌ర్మిన‌ల్‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని అనుకుంటున్నానని రైల్వేస్‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌నుకుంటున్న‌ట్లు తెలిపారు. ప‌చ్చకామెర్లు ఉన్న‌వారికి లోక‌మంతా ప‌చ్చ‌గా క‌నిపించిన‌ట్లు వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి భార‌తీయ జన‌తా పార్టీలోకి వెళ్లిన ఆదినారాయ‌ణ రెడ్డికి త‌న‌లాగే ఇత‌ర‌ వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు కూడా పార్టీ మార‌తారు అనుకోవ‌డం అమాయ‌కత్వం అని తెలిపారు.