Seediri Appalaraju: రుషికొండ వేస్ట్ అయితే అమ‌రావ‌తి కూడా వేస్టే క‌దా

Seediri Appalaraju says if rushikonda is waste of money then so is amaravathi

Seediri Appalaraju: రూ.500 కోట్ల‌తో విశాఖ‌ప‌ట్నంలోని రుషికొండ‌లో నిర్మించిన భ‌వ‌నాలు వృథా అయితే.. ల‌క్ష కోట్ల‌తో అమ‌రావ‌తిలో నిర్మిస్తున్న రాజ‌ధాని కూడా వేస్టే క‌దా అని ప్ర‌శ్నించారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత సీదిరి అప్ప‌ల‌రాజు. రుషికొండ భ‌వ‌నాలు ప్ర‌జ‌ల డ‌బ్బుతో క‌ట్టిన‌వి అని ఆరోపిస్తున్న‌ప్పుడు మ‌రి అమ‌రావ‌తిని సొంత డ‌బ్బుతో క‌డుతున్నారా అని ప్ర‌శ్నించారు. అస‌లు తెలుగు దేశం పార్టీ వాళ్లు ఎప్పుడు ఏం మాట్లాడ‌తారో కూడా అర్థంకాద‌ని పేర్కొన్నారు.