జ‌గ‌న్‌ను కాంగ్రెస్‌లో చేరాల‌ని కోరిన ష‌ర్మిళ‌

did ys sharmila asked jagan to join congress

YS Sharmila:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని కాంగ్రెస్‌లో చేరాల‌ని ఆయ‌న సోద‌రి, చీఫ్ వైఎస్ ష‌ర్మిళ కోరార‌ట‌. ఈ విష‌యాన్ని భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత ఆదినారాయ‌ణ రెడ్డి వెల్ల‌డించారు. డిసెంబ‌ర్ నుంచి జ‌గ‌న్ ఓదార్పు యాత్ర చేప‌ట్ట‌నున్నారు. ఈ యాత్రలో త‌న తల్లి విజ‌య‌మ్మ కూడా పాల్గొంటే బాగుంటుంద‌ని త‌ల్లితో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని ఆదినారాయ‌ణ రెడ్డి తెలిపారు. ఈ నేప‌థ్యంలో ష‌ర్మిళ జ‌గ‌న్‌ను కాంగ్రెస్‌లో చేరాల‌ని అప్పుడే రాజ‌కీయ భ‌విష్య‌త్తు బాగుంటుంద‌ని కోరార‌ట‌. త‌న ఓట‌మికి ష‌ర్మిళ కూడా ఒక కారణం కావ‌డంతో చెల్లితో రాజీ కుద‌ర్చాల‌ని జ‌గ‌న్ విజ‌య‌మ్మ‌ను కోరార‌ట‌. ఇక‌పోతే.. జ‌గ‌న్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు నేత‌లు మిన‌హా మిగ‌తా వారంతా భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నార‌ని..భార‌తీయ జ‌న‌తా పార్టీ వారి కోసం గేట్లు తెరిస్తే మాత్రం ఈరోజు ప్ర‌తిప‌క్షం కోల్పోయిన పార్టీ రేపు పార్టీ ఉనికినే కోల్పోతుంద‌ని ఆదినారాయ‌ణ రెడ్డి వెల్ల‌డించారు.