BJPలోకి మ‌రో YSRCP నేత‌

ysrcp mithun reddy to join bjp

BJP:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవ‌డంతో పార్టీ గ‌తేంటా అని చాలా మంది పార్టీ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు. మ‌ళ్లీ ఐదేళ్లు ఆగాక అధికారంలోకి వ‌స్తామో లేదో తెలీక ఇప్ప‌టి నుంచే మూట స‌ర్దుకుని వేరే పార్టీలోకి జంప్ అవ్వాల‌ని ప్ర‌ణాళిక‌లు వేస్తున్నారు. ఇప్ప‌టికే ఆర్కే రోజా, విడ‌ద‌ల ర‌జ‌నీలు భార‌తీయ జ‌న‌తా పార్టీ పెద్ద‌ల‌తో ట‌చ్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో మ‌రో వైఎస్సార్ కాంగ్రెస్ నేత భార‌తీయ జ‌న‌తా పార్టీలోకి జంప్ అవ్వాల‌ని అనుకుంటున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. అదెవ‌రో కాదు ఎంపీ మిథున్ రెడ్డి. స్వ‌యంగా మిథున్ రెడ్డే భార‌తీయ జ‌న‌తా పార్టీతో ట‌చ్‌లో ఉన్నార‌ట‌. ఈ విష‌యాన్ని భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత ఆదినారాయ‌ణ రెడ్డి వెల్ల‌డించారు.