Venu Swamy: ట్రోల‌ర్స్‌కి థ్యాంక్స్.. మీ వ‌ల్ల క‌స్ట‌మ‌ర్స్ పెరిగారు

venu swamy conveys thanks to all trollers and memers

Venu Swamy: ప్ర‌ముఖ జ్యోతిష్య నిపుణుడు వేణు స్వామి త‌న‌పై ట్రోలింగ్ చేస్తూ మీమ్స్ వేస్తున్న వారికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గెల‌వ‌బోతున్నాడ‌ని మీడియా ముందు ప‌లుమార్లు ఆయ‌న చెప్ప‌డం.. తీరా చూస్తే జ‌గ‌న్‌కు క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవంతో చాలా మంది వేణుస్వామిని ట్రోల్ చేసారు.

దాంతో ఇక‌పై రాజ‌కీయ నేత‌లు, సినీ సెల‌బ్రిటీల వ్య‌క్తిగ‌త జీవితాల‌కు సంబంధించిన ఎలాంటి జోస్యం చెప్ప‌న‌ని ఆయ‌న వెల్ల‌డించారు. అయితే ఈ మీమ‌ర్స్, ట్రోలర్స్ వ‌ల్ల త‌నకు బాగా క‌లిసొచ్చింద‌ని.. ఇంత‌కుముందు వ‌చ్చే క‌స్ట‌మ‌ర్ల కంటే 100 రెట్లు ఎక్కువ‌గా త‌న వ‌ద్ద‌కు వ‌స్తున్నార‌ని ఇప్పుడు తాను చాలా బిజీ అయిపోయాన‌ని తెలిపారు. త‌న‌పై ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నవారిని అమ్మ‌వారు చ‌ల్ల‌గా చూడాల‌ని కోరుకుంటున్న‌ట్లు సెటైర్ వేసారు.