Vijaya Sai Reddy: ఏపీకి ప్ర‌త్యేక హోదా తేవ‌డం చంద్ర‌బాబుకు చిటికెలో ప‌ని

Vijaya Sai Reddy says chandrababu naidu can easily get special status to ap

Vijaya Sai Reddy: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా తేవ‌డం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు చిటికెలో ప‌ని అని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి.  ఇప్పుడు NDA కూట‌మికి చంద్ర‌బాబు నాయుడుతో పని ఉంద‌ని.. ఆ కూట‌మి ఆయ‌న‌పై ఆధార‌ప‌డి ఉంది కాబ‌ట్టి.. ఇప్పుడు ఏమ‌డిగినా వారు ఇవ్వ‌డానికి వెనుకాడ‌ర‌ని అన్నారు. అలాంట‌ప్పుడు చంద్ర‌బాబు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాల‌ని ఒక్క మాట అడిగినా వెంట‌నే హోదా వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.