Train Accident: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ

Train Accident in west bengal

Train Accident: ప‌శ్చిమ బెంగాల్‌లో రైలు ప్ర‌మాదం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలోని న్యూజల్పాయిగురిలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. కాంచ‌న‌జంగా ఎక్స్‌ప్రెస్ రైలు గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెంద‌గా పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.