Nara Lokesh: తిరుమ‌ల‌లో ప‌ర‌దాలు.. నారా లోకేష్ సెటైర్లు

nara lokesh satires on jagan during tirumala trip

Nara Lokesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన అనంత‌రం చంద్ర‌బాబు నాయుడు కుటుంబంతో క‌లిసి నిన్న రాత్రి తిరుమ‌ల బ‌య‌లుదేరారు. ఈ రోజు ఉద‌యం శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. అయితే నిన్న ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుమ‌ల‌కు చేరుకున్నాక‌.. నారా లోకేష్ మాజీ సీఎం జ‌గ‌న్‌పై సెటైర్లు వేసారు. నారా లోకేష్ వెళ్తున్న ప్ర‌దేశంలో ప‌ర‌దాలు క‌ట్టి ఉంచ‌డంతో మ‌ళ్లీ ప‌ర‌దాలు ఎందుకు క‌ట్టారు? ఓహో అల‌వాటులో పొర‌పాటా. ఎంతో మందికి చెప్ప‌లేక చ‌స్తున్నాన‌య్యా ప‌ర‌దాలు వ‌ద్ద‌ని అంటూ సెటైర్లు వేసారు.

జ‌గన్ ముఖ్యమంత్రిగా ఉన్న‌ప్పుడు ఎక్క‌డికి వెళ్లాల‌న్నా వాహ‌నాల‌కు ప‌ర‌దాలు క‌ట్టుకుని వెళ్లే వారు. దీనిపై చాలా మంది నుంచి విమ‌ర్శ‌లు వెక్కిరింత‌లు వ‌చ్చాయి.