Kiraak RP: అల్లు అర్జున్.. నీ ప‌త‌నం మొద‌లైంది

kiraak rp shocking comments on allu arjun

Kiraak RP: తెలుగు దేశం పార్టీ మ‌ద్ద‌తుదారుడు, క‌మెడియ‌న్ కిరాక్ ఆర్పీ అల్లు అర్జున్‌పై షాకింగ్ కామెంట్స్ చేసారు. అల్లు అర్జున్.. ఇక నీ ప‌త‌నం మొద‌లైంది అంటూ రెచ్చిపోయాడు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల స‌మ‌యంలో అల్లు అర్జున్ జ‌నసేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ర‌ఫున ప్ర‌చారంలో పాల్గొన‌కుండా.. కేవ‌లం మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ట్లు ట్వీట్ మాత్ర‌మే చేసి ఊరుకున్నారు. ఆ త‌ర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే అభ్య‌ర్ధి శిల్పా ర‌విచంద్ర కిశోర్ రెడ్డి కోసం నంద్యాల‌లో ప్ర‌చారం చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఏ పార్టీ నేత‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని నోటికొచ్చిన‌ట్లు తిట్టారో వారికే అల్లు అర్జున్ స్వ‌యంగా వెళ్లి ప్ర‌చారం చేయ‌డంపై జ‌న‌సేన‌, తెలుగు దేశం పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో చ‌ర్చ‌కు దారి తీసింది. అయినా అల్లు అర్జున్ వ‌ల్ల ర‌విచంద్ర కిశోర్ రెడ్డి గెలిచింది లేదు. ఆయ‌న ఓడిపోయాడు. దీనిపై కిరాక్ ఆర్పీ స్పందిస్తూ.. “” వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ల ప‌త‌నం మొద‌లైంది. ఆ నేత‌ల్లో ఒక‌రికి మ‌ద్ద‌తు ఇచ్చిన అల్లు అర్జున్ ప‌త‌నం కూడా మొద‌లైన‌ట్లే. అల్లు అర్జున్‌కి అభిమానుల సైన్యం ఏమీ లేదు. సైన్యం అంటే తెలుగు దేశం, భార‌తీయ జ‌న‌తా పార్టీ, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, మ‌ద్ద‌తుదారుల‌ది. నేను ఎవ్వ‌రికీ భ‌య‌ప‌డ‌ను. నేను నాడు చెప్పాను.. నేడూ చెప్తున్నాను.. అల్లు అర్జున్ చేసింది ముమ్మాటికీ త‌ప్పే “” అని తెలిపారు.