Nara Lokesh: జగన్ ఓడిపోయినా రక్త చరిత్ర రాస్తూనే ఉన్నాడు

nara lokesh alleges jagan killed tdp supporter

Nara Lokesh: వైఎస్ జగన్ ఓడిపోయినా రక్త చరిత్ర రాస్తూనే ఉన్నాడని అన్నారు తెలుగు దేశం పార్టీ నేత నారా లోకేష్. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లెకి చెందిన తెలుగు దేశం పార్టీ నేత గౌరీనాథ్ చౌదరిని జ‌గ‌న్ దారుణంగా హత్య చేయించారని లోకేష్ ఆరోపించారు. వైసీపీ ఫ్యాక్షన్ పాలన వద్దని జనం ఛీకొట్టినా, బాబాయ్‌ని చంపినట్టే జనాన్ని చంపుతూ ఉన్నాడని జగన్‌పై మండిప‌డ్డారు. హత్యా రాజకీయాలు ఇకనైనా జగన్ రెడ్డి ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని… గౌరీనాథ్ చౌదరి కుటుంబానికి తెలుగు దేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. నిందితులను వదిలే ప్రసక్తే లేదని… వైసిపి ఫ్యాక్షన్ దాడులకు చెక్ పెడతామ‌ని… శాంతిభద్రతలు కాపాడుతామ‌ని లోకేష్ తెలిపారు.