Kethi Reddy: CMOలోకి ఎవ‌డెవ‌డో వ‌చ్చేవాడు.. జ‌గ‌న్ మాకు టైం ఇచ్చేవాడు కాదు

kethi reddy reveals the reason behind his loss in ap elections

Kethi Reddy: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో తాము ఓడిపోవ‌డానికి ఎన్నో కార‌ణాలు ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌ధాన కార‌ణం మాత్రం మాజీ సీఎం జ‌గ‌న్ త‌మ‌కు స‌మ‌యం ఇచ్చి స‌మ‌స్య‌లు తెలుసుకోక‌పోవ‌డ‌మే అని అన్నారు కేతిరెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి. ఇత‌ర వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ల‌తో పోలిస్తే కేతిరెడ్డి కాస్త బెట‌ర్. క‌నీసం ఆయ‌న గుడ్‌మార్నింగ్ ధ‌ర్మ‌వ‌రం అనే పేరుతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లి వారిని ప‌ల‌కించేవారు. ఇత‌ర నేత‌లు ఇలా చేసిన పాపాన పోలేదు.

కార్యాల‌యంలో జ‌గ‌న్‌తో పాటు ఎవ‌డెవ‌డో కూర్చుని గంట‌లు త‌ర‌బ‌డి మాట్లాడుతుండేవార‌ని.. ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం ఆయ‌న అపాయింట్మెంట్ కోసం గేటు బ‌య‌ట ప‌డిగాపులు కాచేవార‌ని కేతిరెడ్డి అన్నారు. త‌మ బాధ‌లు చెప్పుకోలేక జ‌గ‌న్‌ను ఏమీ అన‌లేక మౌనంగా వెళ్లిపోయేవార‌ని తమ ఓటిమికి ఎన్నో కార‌ణాలు ఉన్న‌ప్ప‌టికీ ఈ దూరం పెట్ట‌డం మాత్రం ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని వెల్ల‌డించారు.