Russia: న‌ది నుంచి బ‌య‌ట‌ప‌డిన భార‌తీయ విద్యార్థుల మృత‌దేహాలు

4 indian students bodies found in russia

Russia: ర‌ష్యాలో విషాదం చోటుచేసుకుంది. న‌లుగురు భార‌తీయ విద్యార్థుల మృత‌దేహాలు అక్కడి ఓ న‌దిలో ల‌భ్యం కావ‌డంతో స్థానికంగా క‌ల‌కలం రేపింది. ఈ ఘ‌ట‌న ర‌ష్యాలోని సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్‌లో చోటుచేసుకుంది. విహార‌యాత్ర నిమిత్తం ఓ యువ‌తితో పాటు మ‌రో ముగ్గురు మెడిక‌ల్ విద్యార్థులు సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్‌లోని ఓ న‌దికి వెళ్లారు. ఆ స‌మ‌యంలో న‌దిలో దిగ‌గా.. నీటి ప్ర‌వాహం ఎక్కువై న‌లుగురూ కొట్టుకుపోయారు. యువ‌తి మృతదేహం ల‌భించ‌గా మ‌రో ముగ్గురు విద్యార్థుల మృత‌దేహాల కోసం గాలింపులు చేప‌డుతున్నారు. చ‌దువుకోవ‌డానికి వెళ్లి ప్ర‌యోజ‌కులు అవుతార‌ని వెళ్లిన బిడ్డ‌లు శ‌వాలుగా మారి రావ‌డంతో త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు.