Pilli Subash Chandra Bose: మా హిస్ట‌రీ తెలుసుగా.. మాతో పెట్టుకోకండి

Pilli Subash Chandra Bose silly warning to tdp

 

Pilli Subash Chandra Bose: ఓడిపోయామ‌న్న బాధ లేదు. బాధ ప‌డ‌క‌పోయినా ప‌ద్ధ‌తి మార్చుకుని హుందాగా ప్ర‌వ‌ర్తిస్తారా అంటే అదీ లేదు. రెండు ముఠాల మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ‌ను తెర‌పైకి తీసుకొచ్చి తెలుగు దేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు.. త‌మ వైఎస్సార్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు చేసారంటూ నిన్న మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేసారు. ఇలాంటి దాడుల‌ను వెంట‌నే ఆప‌క‌పోతే రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు అనేవే ఉండ‌వు అని సిల్లీగా మాట్లాడారు. దీనిపై ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ నేత పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ మాట్లాడారు.

అధికారంలోకి వ‌చ్చాక రాష్ట్రానికి మంచి చేయడంపై దృష్టి పెట్టాల‌ని అంతేకానీ.. త‌మ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను టార్గెట్ చేసి వారిపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమ‌ని అన్నారు. ఇలాంటి దాడులు చేసే ముందు త‌మ కార్య‌క‌ర్త‌ల హిస్ట‌రీ గురించి తెలుసుకోవాల‌ని.. త‌మ హిస్ట‌రీ తెలిస్తేనే త‌మ‌తో పెట్టుకోవాల‌ని లేదంటే తెలుసుకోవాల‌ని వార్నింగ్ ఇస్తున్న‌ట్లు మాట్లాడారు. త‌మ మీద రాళ్లు వేస్తే ఆ వేసినోడి మీద బండ‌లు వేసి స‌మాధానం చెప్తామ‌ని హెచ్చ‌రించారు. అధికారం వ‌చ్చింది క‌దా అని త‌మ‌కు గుణ‌పాఠం నేర్పుతాం, డిసిప్లైన్ నేర్పుతాం అంటే ఇక్క‌డ ఎవ్వ‌రూ చేతులు క‌ట్టుకుని కూర్చోలేద‌ని అన్నారు.