Gudivada Amarnath: రాజ‌ధానిగా విశాఖ‌ను ప‌రిశీలించండి బాబు గారూ..

Gudivada Amarnath requests chandrababu naidu to think about vizag as capital

Gudivada Amarnath: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని కాకుండా విశాఖ‌ను ప‌రిశీలించాల‌ని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుని అభ్య‌ర్ధించారు వైఎస్సార్ కాంగ్రెస్ మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్. అమ‌రావ‌తిని వ‌దిలేయ‌మ‌ని తాము చెప్పడంలేద‌ని.. అమ‌రావ‌తిని ఓ గొప్ప న‌గ‌రంగా తీర్చిదిద్దుతూనే రాజ‌ధానికి కావాల్సిన అన్ని వ‌న‌రులు క‌లిగిన విశాఖ‌ను రాజ‌ధానిగా ప‌రిశీలిస్తే బాగుంటుంద‌ని కోరారు.

“” ప్ర‌జ‌ల‌కు అడిగిన‌దానికంటే ఎక్కువే చేసాం. వారి కోసం అన్ని ర‌కాల వ‌స‌తులు క‌ల్పించాం. అన్నీ వారి ఇంటి వ‌ద్దే అందించాం. అయినా ప్ర‌జ‌ల‌కు మా నుంచి ఏం త‌క్కువైందో అర్థంకావ‌డంలేదు. త‌ప్ప‌కుండా ఎక్క‌డ లోపాలు జ‌రిగాయో స‌మీక్ష చేసుకుని మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తాం. కొత్త‌గా ఏర్ప‌డిన ప్ర‌భుత్వాన్ని రేప‌టికి రేపే హామీల‌న్నీ నెర‌వేర్చాల‌ని అడ‌గం. వారికి కావాల్సిన స‌మ‌యం ఇస్తాం. కానీ వారు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌క‌పోతే మాత్రం క‌చ్చితంగా ప్రతిప‌క్ష హోదాలో ఉండి ప్ర‌శ్నించి తీర‌తాం “” అని తెలిపారు.