Chandrababu Naidu: ప్ర‌జ‌ల రుణం తీర్చుకుంటాం

Chandrababu Naidu press meet after winning ap elections

Chandrababu Naidu: ప్ర‌జ‌లు గెలిపిస్తార‌ని తెలుసు కానీ ఇంత రేంజ్‌లో గెలిపిస్తార‌ని అస‌లు ఊహించ‌లేద‌ని అన్నారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు. అధికారం ఉంది క‌దా అని అహంకారంతో విర్ర‌వీగే పాల‌కుల‌ను త‌రిమికొడ‌తామ‌ని ప్ర‌జ‌లు మ‌రోసారి తెలియ‌జెప్పార‌ని అన్నారు.  ప్ర‌జ‌లు త‌న‌ను న‌మ్మి మ‌రోసారి అధికారం ఇచ్చినందుకు వారి రుణం తీర్చుకుంటాన‌ని.. ప్ర‌జ‌లు ఓటేసాం మా ప‌నైపోయింది అన్న‌ట్లు ఉండ‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడు తాము చేస్తున్న ప‌నుల‌ను గ‌మ‌నిస్తూ ఫీడ్‌బ్యాక్ ఇస్తే బాగుంటుంద‌ని చంద్ర‌బాబు అన్నారు. రేపు ఢిల్లీకి వెళ్లి ఎన్డీయే పెద్ద‌ల‌తో మీటింగ్ అయ్యాక ఏమ‌న్నా మార్పులు ఉంటే తప్ప‌కుండా మీడియాకు తెలియజేస్తాన‌ని పేర్కొన్నారు.