రోజా బొక్క ప‌గ‌ల‌బోతోంది.. స‌జ్జ‌ల‌ను కాపాడుకోండి..

Anam Venkata Ramana Reddy sensational Comments On Jagan and Roja

 

రేపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌బోతున్న నేప‌థ్యంలో తెలుగు దేశం పార్టీ నేత ఆనం వెంక‌ట‌ర‌మ‌ణ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అయిన రోజా, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిల‌పై షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు. రేపు రోజా బొక్క ప‌గ‌ల‌బోతోందని.. రోజాతో పాటు ఇత‌ర వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ల‌కు కూడా ప‌గ‌ల‌బోతోంద‌ని అన్నారు. ముందుగా న‌గిరి నుంచే ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయ‌ని తెలిపారు. శ్రీవారి ద‌ర్శ‌నానికి వెళ్లిన‌ప్పుడు కేవ‌లం శ్రీవారి గురించే మాట్లాడాలి కానీ రాజ‌కీయాల గురించి జ‌గన్ గురించి మాట్లాడాల్సిన అవ‌స‌రం ఏంట‌ని ఆనం మండిప‌డ్డారు. రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తాడేప‌ల్లిగూడెం ప్యాలెస్‌కి వెళ్ల‌క‌పోవ‌డం మంచిద‌ని.. అక్క‌డ జ‌గ‌న్ కంట ప‌డితే స‌జ్జ‌ల‌ను ఎగిరి ఎగిరి మ‌రీ తంతాడ‌ని.. స‌జ్జ‌ల‌తో పాటు ఇత‌ర వైఎస్సార్ కాంగ్రెస్ నాయ‌కులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని తెలిపారు.