AP Elections Exit Polls: డిపాజిట్ కోల్పోనున్న వైఎస్ ష‌ర్మిళ‌..!

ys sharmila to lose deposit in kadapa

AP Elections Exit Polls:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎంపీ ఎన్నిక‌ల్లో తొలిసారి క‌డ‌ప ఎంపీ స్థానం నుంచి పోటీ చేసింది APCC చీఫ్ వైఎస్ ష‌ర్మిళ‌. ఈరోజు వెలువ‌డిన ఎగ్జిట్ పోల్స్ ప్ర‌కారం.. ష‌ర్మిళ అంత క‌ష్ట‌ప‌డినా డిపాజిట్లు కూడా రావ‌ని ఆరా మ‌స్తాన్ ఎగ్జిట్ పోల్స్ స‌ర్వే వెల్ల‌డించింది. దాంతో ఏపీ కాంగ్రెస్‌లో గుబులు రేగింది. చూడ‌బోతే క‌డ‌ప ఓట‌ర్లు ఈసారి కూడా అధికారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయిన వైఎస్ అవినాష్ రెడ్డికే క‌ట్ట‌బెట్ట‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. వైఎస్ వివేకానంద రెడ్డిని హ‌త్య చేసింది అవినాషే అని.. చేయించింది జ‌గ‌న్ మోహన్ రెడ్డి అని ష‌ర్మిళ‌తో పాటు వైఎస్ సునీతా రెడ్డి గొంతు చించుకుని అరిచినా ప్ర‌యోజ‌నం లేకుండాపోయేలా ఉంద‌నే టాక్ వినిపిస్తోంది. ఏదేమైన‌ప్ప‌టికీ… ఎగ్జిట్ పోల్స్ తారుమారు అయ్యే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి అస‌లైన ఫ‌లితాల కోసం జూన్ 4 వ‌ర‌కు వేచి చూడాల్సిందే