ఒక్క రూపాయి.. స్నేహితుడిని బ‌లిగొన్న క‌సాయి

man kills his friend because of one rupee

Viral News: క్ష‌ణికావేశం ఎంతటి దారుణానికి దారితీస్తుందో వివ‌రించే ఘ‌ట‌న ఇది. ఒక్క రూపాయి కోసం ఓ వ్య‌క్తి తన స్నేహితుడి చావుకు కార‌ణం అయ్యాడు. ఈ ఘ‌ట‌న వరంగల్‌లో చోటుచేసుకుంది. గాంధీనగర్‌కి చెందిన‌ ప్రేమ్ సాగర్, అరవింద్ స్నేహితులు. వీరిద్ద‌రూ నిన్న‌ ఒక హోటల్‌లో బిర్యానీ తిన్నారు. బిల్లు రూ.59 అవ్వ‌గా.. అరవింద్ రూ.60 క‌ట్టాడు. దీంతో ప్రేమ్ సాగర్ ఒక్క రూపాయి ఇచ్చేంత పెద్దోడివి అయ్యవురా అంటూ ఎగతాళి చేశాడు. ఇది కాస్త ఇద్దరి మధ్య వివాదంగా మారింది. కోపంతో అరవింద్… ప్రేమ సాగర్‌ను తొయ్యడంతో అత‌ను రాయి మీద పడ్డాడు. మెదడులో రక్తం గడ్డ కట్టి అక్క‌డిక‌క్క‌డే చనిపోయాడు.