పెళ్లికి ఒప్పుకోలేదని యువతి గొంతుకోసి.. తానూ కోసుకుని..

man kills woman in eluru later tries to commit suicide

Eluru: ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ యువ‌కుడు త‌న ప్రేమ‌ను ఒప్పుకోలేద‌ని ఓ యువ‌తి గొంతు కోసి దారుణంగా హ‌త్య చేసాడు. ఆ త‌ర్వాత తానూ గొంతు కోసుకుని చావుబ‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. సత్రంపాడుకి చెందిన‌ రత్నా గ్రేస్ (23) ఏసురత్నం (23) స్నేహితులు కాగా త‌న‌ను పెళ్లి చేసుకోవాలని ఏసురత్నం కొంతకాలంగా వెంటపడుతున్నాడు.

ఇందుకు ర‌త్నా ఒప్పుకోలేదు. ఈ నేప‌థ్యంలో ఈ నెల 26న రత్నా గ్రేస్‌కి వేరే యువకుడితో నిశ్చితార్థం జ‌రిగింది. విష‌యం ఏసుర‌త్నంకు తెలిసి గురువారం మధ్యాహ్నం కత్తితో రత్నా గ్రేస్ గొంతుకోసి హత్య చేసాడు. ఆ తర్వాత తాను కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనలో యువతి మృతిచెందగా.. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.