Warangal: ఆత్మ‌హ‌త్య చేసుకున్న మూడో త‌ర‌గ‌తి బాలుడు

9 year old kid commits suicide in warangal

Warangal: మూడో త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న వ‌రంగ‌ల్‌లో చోటుచేసుకుంది. దుగ్గొండి మండలం మైసంపల్లికి చెందిన సిద్ధు (9) మూడో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో ఎండలో ఎక్కువగా తిరుగుతూ, ఆడుకుంటున్నాడని ఎండలో తిరగవద్దని తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన సిద్ధు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంత చిన్న వ‌య‌సులో ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంపై పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.