AP Elections: తొలి ఫ‌లితాలు VIP సీట్ల నుంచే

first results will be out from vip seats

AP Elections: ఆంధ్రప్ర‌దేశ్ ఎన్నిక‌ల ఫ‌లితాలు జూన్ 4న వెలువ‌డ‌నున్నాయి. కౌంటింగ్ త‌ర్వాత కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు ఇళ్ల‌కే ప‌రిమితం కాగా.. మరికొంద‌రు స‌మ్మ‌ర్ వెకేష‌న్ కోస‌మ‌ని విదేశాల‌కు వెళ్లారు. కౌంటింగ్ తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో వారంతా స్వ‌దేశాల‌కు చేరుకుంటున్నారు. అయితే.. కౌంటింగ్ రోజున ముందు వీఐపి నియోజ‌క‌వ‌ర్గాలైన కుప్పం (చంద్ర‌బాబు నాయుడు), పిఠాపురం (ప‌వ‌న్ క‌ళ్యాణ్‌), నంద‌మూరి బాల‌కృష్ణ (హిందూపురం), జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (పులివెందుల‌), మంగ‌ళ‌గిరి (నారా లోకేష‌) నుంచే తొలి రౌండ్ ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. ఈ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో దాదాపు 18 రౌండ్ల‌లో కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది.