Vamsi Krishna Yadav: 30 వేల మెజారిటీతో గెల‌వ‌బోతున్నా

janasena Vamsi Krishna Yadav confident on winning with 30k majority

Vamsi Krishna Yadav:  ఈసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో 30 వేల మెజారిటీతో గెల‌వ‌బోతున్నాన‌ని అన్నారు జ‌న‌సేన ఎమ్మెల్యే అభ్య‌ర్ధి వంశీ కృష్ణ యాద‌వ్. జ‌న‌సేన నుంచి వంశీ విశాఖ సౌత్ నుంచి పోటీ చేసారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ 30 వేల మెజారిటీతో గెల‌వ‌బోతున్నా అని ధీమాగా చెప్పారు. ప్ర‌జారాజ్యం పార్టీతో ఆగిపోయిన త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తును జ‌న‌సేన‌తో కొన‌సాగిస్తున్నానని పేర్కొన్నారు.