Rave Party Case: చిరంజీవి, హేమ‌ల‌కు నోటీసులు జారీ..!

banglore police sends legal notice to hema and chiranjevi

Rave Party Case: బెంగ‌ళూరు రేవ్ పార్టీ కేసులో భాగంగా బెంగ‌ళూరు పోలీసులు టాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు లీగ‌ల్ నోటీసులు పంపారు. న‌టి హేమ‌తో పాటు చిరంజీవి, రాజ‌శేఖ‌ర్, కాంతి, సుజాత, ఆశీ రాయ్, రిషి చౌద‌రి, ప్ర‌స‌న్న‌, శివానీ జైస్వాల్ త‌దిత‌రుల‌కు బెంగ‌ళూరు పోలీసులు నోటీసులు పంపారు. ఈనెల 27న విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసారు. అయితే ఈ కేసులో దాదాపు 83 మంది డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు నిర్ధార‌ణ అయ్యింద‌ని అందులో న‌టి హేమ కూడా ఉన్నార‌ని పోలీసులు తెలిపారు. అలాంట‌ప్పుడు అస‌లు కేసుతో సంబంధం లేని చిరంజీవి, రాజ‌శేఖ‌ర్‌ల‌కు బెంగ‌ళూరు పోలీసులు ఎందుకు నోటీసులు పంపారో తెలియాల్సి ఉంది.