AP Elections: మాచ‌ర్ల‌లో రీ పోలింగ్?

will there be re polling in macherla

AP Elections: మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో రీ పోలింగ్ జ‌రిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మాచ‌ర్ల‌కు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పోలింగ్ రోజున బూత్‌లోకి వెళ్లి ఈవీఎం ధ్వంసం చేయ‌డం.. అక్క‌డి మ‌హిళా ఓట‌రు ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించిన వీడియోలు బ‌య‌టికి రావ‌డం వివాదాస్ప‌దంగా మారింది.  దీనిపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్పందించింది. ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు పిన్నెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈవీఎం ధ్వంసం చేయ‌డంతో మాచ‌ర్ల‌లో రీ పోలింగ్ జ‌రుగుతుందా? అనే ప్ర‌శ్న‌కు ఎన్నిక‌ల సంఘం అధికారి స్పందించారు. ఈవీఎం ధ్వంసం అయిన‌ప్ప‌టికీ అందులో డేటా భ‌ద్రంగా ఉంద‌ని.. అందుకే వేరే ఈవీఎం పెట్టించామ‌ని తెలిపారు. మాచ‌ర్ల‌లో రీపోలింగ్ అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసారు.