IPL 2025: ముంబై ఇండియ‌న్స్‌లో కొన‌సాగేది వీరే

mi to retain these players in ipl 2025

IPL 2025: ఇంకా 2024 ఐపీఎల్ మ్యాచ్‌లు పూర్తి కాలేదు. అప్పుడే 2025 ఐపీఎల్ గురించి చ‌ర్చ మొద‌లైపోయింది. ఈసారి జ‌న‌వ‌రిలోనే ఐపీఎల్ వేలం ఉండ‌బోతోంద‌ని టాక్. 2024 ఐపీఎల్‌లో పేల‌వ ప్ర‌దర్శ‌న‌తో ముందే ఎగ్జిట్ అయిపోయిన ముంబై ఇండియ‌న్స్ కొంద‌రు ఆట‌గాళ్ల‌ను టీంలోనే ఉంచుకోవాల‌ని చూస్తోంద‌ట‌. వారెవరంటే..

హార్దిక్ పాండ్య – 15 కోట్లు

సూర్య కుమార్ యాద‌వ్ – 8 కోట్లు

జ‌స్ప్రీత్ బుమ్రా – 12 కోట్లు

తిల‌క్ వ‌ర్మ – 1.7 కోట్లు

ముంబై ఇండియన్స్ టీంకి కెప్టెన్ అయ్యాక హార్దిక్‌ పాండ్య ప్ర‌ద‌ర్శ‌న చాలా పేల‌వంగా ఉంది. అస‌లు హార్దిక్ వ‌ల్లే ముంబై ఇండియ‌న్స్ వ్యాల్యూ పోయింద‌నే టాక్ కూడా ఉంది. అయిన‌ప్ప‌టికీ 2025లో హార్దిక్ పాండ్య‌ను టీంలో ఉంచాల‌ని యాజ‌మాన్యం నిర్ణ‌యించుకుంది.