MS Dhoni: రిటైర్మెంట్ గురించి ధోనీ BCCIకి ఏం చెప్పాడు?

what MS Dhoni told management about his retirement

MS Dhoni: ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్.. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చేతిలో ఓడిపోయింది. దాంతో ఎంఎస్ ధోనీ చాలా బాధ‌ప‌డ్డారు. మ్యాచ్ ఓడిపోయిన వెంట‌నే ఆయ‌న మ‌రుస‌టి రోజే త‌న స్వ‌స్థ‌లం రాంచీకి వెళ్లిపోయారు. ఐపీఎల్ టీం నుంచి ఇంటికి వెళ్లిపోయిన తొలి ఆట‌గాడు ధోనీనే అని టాక్.  2023లోనే ధోనీ ఐపీఎల్ కెరీర్‌కు రాం రాం చెప్తారు అని ఫ్యాన్స్ అంతా అనుకున్నారు. కానీ ధోనీ మాత్రం ఫ్యాన్స్ కోసం 2024లోనూ ఆడారు. ఇప్పుడు కీల‌క మ్యాచ్‌లో ఓడిపోవ‌డంతో ధోనీ ఇక ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తార‌ని అంతా అనుకుంటున్నారు. దీనిపై ధోనీ బీసీసీఐకి ఇంకా త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌లేద‌ట‌. కొన్ని నెల‌ల్లో కొన‌సాగుతానా లేక రిటైర్ అవుతానా అనే విష‌యాన్ని ప్ర‌క‌టిస్తాన‌ని అప్ప‌టివ‌ర‌కు త‌న‌ను ద‌య‌చేసి ఏమీ అడ‌గొద్ద‌ని ధోనీ బీసీసీఐకి వెల్ల‌డించిన‌ట్లు చెన్నై సూప‌ర్ కింగ్స్ యాజ‌మాన్యం వెల్ల‌డించింది.