ఆనాడు బిడ్డ సేఫ్‌.. నేడు ట్రోల్స్ త‌ట్టుకోలేక త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌

Chennai: ఇట‌వ‌ల చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నెల‌ల ప‌సికందు జారి అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంత‌స్తు అర‌పై ప‌డిపోయాడు. స్థానికులు ఎలాగో అలా బిడ్డ‌ను క్షేమంగా బ‌య‌టికి తీసారు. అయితే బిడ్డను సరిగ్గా పట్టించుకోవడం లేదని ఆన్‌లైన్‌లో విమర్శలు వ‌స్తుండ‌డంతో అవమానం తట్టుకోలేక ఆ పసికందు త‌ల్లి రమ్య‌ ఆత్మహత్య చేసుకుంది.

ఆ ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత అపార్ట్‌మెంట్‌లోని వారే కాకుండా కాల‌నీ వాళ్లంతా బిడ్డను సరిగ్గా చూసుకోవటం రాదంటూ విమర్శించారు. ఆమె బ‌య‌ట క‌నిపిస్తే చీద‌రించుకునేవారు. దీంతో అవమానాలు తట్టుకోలేక భర్త మరియు బిడ్డను తీసుకొని కోయంబత్తూర్ కరమడైలోని తన పుట్టింటికి వెళ్లింది. ఆ విమర్శలతో మనస్తాపం చెంది ర‌మ్య ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో వాళ్లు ఇంటికి వచ్చేసరికి రమ్య స్పృహలో లేకపోవటాన్ని గమనించి హాస్పిట‌ల్‌కి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.