అన్న‌మ‌య్య జిల్లాలో పోలింగ్ బూత్ ఏజెంట్లు కిడ్నాప్

polling paused in annamayya district

AP Elections:  అన్నమయ్య జిల్లాలో ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పుల్లంపేట మండలంలో ఈవీఎంలు ధ్వంసం చేసారు. వైఎస్సార్ కాంగ్రెస్, జ‌న‌సేన‌ కార్యకర్తల మ‌ధ్య‌ ఘర్షణ జ‌ర‌గ‌డంతో ఈవీఎంలు ధ్వంసం చేసి హంగామా చేసారు. పోలింగ్ ప్ర‌శాంతంగా జ‌ర‌గ‌నివ్వ‌కుండా బూత్ ఏజెంట్లను కిడ్నాప్ చేసారు.