కానిస్టేబుల్‌కి దొర‌క‌ని సెల‌వు.. భార్య‌ బిడ్డ మృతి

Viral News: ఓ కానిస్టేబుల్ సెల‌వు కోసం బ‌తిమాలుకున్నా అత‌ని పై అధికారి క‌నిక‌రించ‌లేదు. దాంతో అత‌ను భార్య‌, బిడ్డ‌ను కోల్పోయాడు. ఈ విషాద ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. వికాస్ అనే వ్య‌క్తి జ‌లావ్ ప్రాంతంలోని పోలీస్ స్టేష‌న్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. గ‌ర్భిణి అయిన ఇత‌ని భార్య డెలివ‌రీ స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డ‌టంతో వికాస్ సెల‌వు కావాల‌ని అడిగాడు. కానీ అత‌ని పై అధికారి సెల‌వు ఇవ్వ‌లేదు. దాంతో వికాస్ స‌మ‌యానికి త‌న భార్య‌ను హాస్పిట‌ల్‌కు తీసుకెళ్ల‌లేక‌పోయాడు. ఆల‌స్యం అవ‌డంతో కుటుంబ స‌భ్యులు వికాస్ భార్య‌ను హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. ఆమె బిడ్డ‌ను క‌న్నారు కానీ స‌మ‌యానికి రాక‌పోవ‌డంతో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మించి త‌ల్లి, బిడ్డ చ‌నిపోయారు. విష‌యం తెలిసి వికాస్ కుమిలిపోయాడు. త‌న‌కు సెల‌వు ఇవ్వ‌నందుకే త‌న భార్య‌, బిడ్డ మృతిచెందార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసాడు. దీనిపై పై అధికారులు స్పందించి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.

ALSO READ:

Rajamundry: కంట్లో కారం కొట్టి.. వ‌ధువును కిడ్నాప్ చేయ‌బోయి..