Pawan Kalyan స‌భ‌లో క‌త్తి క‌ల‌క‌లం..!

Pawan Kalyan: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌భ‌లో క‌త్తి క‌ల‌క‌లం సృష్టించింది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. బ‌లుసుమూడి, దుర్గాపురానికి చెందిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను త‌నిఖీ చేయ‌డంతో వారి వ‌ద్ద క‌త్తి లభించింది. నిన్న‌ భీమ‌వ‌రంలో ప‌వ‌న్ స‌భలో పాల్గొన్న స‌మ‌యంలో వీరిద్ద‌రూ అదే స‌భలో ఉన్నారు. వారిని స్థానిక పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అయితే వారిద్ద‌రూ జేబు దొంగ‌లా లేక నిజంగానే దాడి చేసేందుకు వ‌చ్చారా అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు. అనుమానితుల్లో ఒక‌రు పోలీస్‌పై దాడి చేయ‌బోయాడ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇదే అంశంపై ప్ర‌స్తావించారు. త‌న‌పై త‌న నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై బ్లేడ్ల‌తో దాడులు చేస్తున్నార‌ని అన్నారు. ఇప్పుడు ఇద్ద‌రు అనుమానితుల వ‌ద్ద క‌త్తి ల‌భ్యం కావ‌డంతో జ‌న‌సేనానికి ప్ర‌మాదం పొంచి ఉంది అని అభిమానులు, నేతలు, జ‌న‌సైనికులు ఆందోళ‌న చెందుతున్నారు.

ALSO READ:

Jagan: రుణ‌మాఫీ చేద్దామా?

YS Sharmila: ష‌ర్మిళ అఫిడ‌విట్‌లో ఆస‌క్తిక‌ర అంశాలు