AP Elections: భర్తపై భార్య పోటీ..!

AP Elections: అసెంబ్లీ ఎన్నికల్లో భర్తపై భార్య పోటీకి దిగనుంది. శ్రీకాకుళం జిల్లాలోని టెక్క‌లి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ బరిలో నిలిచారు. ఈ క్రమంలో ఆయనకు పోటీగా సతీమణి వాణి రెబల్‌గా బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన అనుచరులతో చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22న ఆమె నామినేషన్ వేయనున్నారు. కాగా ఈ దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ALSO READ

AP Elections: నామినేష‌న్లు వేసిన వారిలో రిచెస్ట్ వీరే

https://telugu.newsx.com/tag/ap-elections/