Vijaya Sai Reddy: ష‌ర్మిళ వాద‌న‌తో ఏకీభ‌విస్తున్నా

తాను APCC చీఫ్ వైఎస్ ష‌ర్మిళ (YS Sharmila) వాద‌న‌తో ఏకీభ‌విస్తున్నాన‌ని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజ‌య సాయి రెడ్డి. ష‌ర్మిళ ఈ లోక్ స‌భ ఎన్నిక‌ల్లో క‌డ‌ప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆమె ప్ర‌సంగంలో ఓ మాట‌న్నారు. పిల్ల‌ల భ‌విష్య‌త్తుని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాల‌ని అన్నారు. దీనిపై విజ‌య సాయి రెడ్డి స్పందిస్తూ.. “” ఈ విష‌యంలో నేను ఏపీ కాంగ్రెస్‌తో ఏకీభ‌విస్తున్నాను. ప్ర‌జ‌లు పిల్ల‌ల భ‌విష్య‌త్తుని దృష్టిలో పెట్టుకునే ఓటు వేయాలి. జ‌గ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన ఐబీ క‌రిక్యుల‌మ్, గోరు ముద్ద‌, మ‌న బ‌డి, నాడు నేడు, విద్యా కానుక‌, విద్యా దీవెన, వ‌స‌తి దీవెన కార్య‌క్ర‌మాలే వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓట్లు తెచ్చిపెడ‌తాయి “” అన్నారు.

ALSO READ:

Vijaya Sai Reddy: ఆనాడు ఇవ్వ‌లేనివి ఇప్పుడెలా ఇస్తారు?

Vijaya Sai Reddy: అందుకే వివేకా గుండెపోటుతో చ‌నిపోయాడ‌ని చెప్పాం