Janasena: పార్టీకి బిగ్ రిలీఫ్‌.. ఎన్నిక‌ల క‌మిష‌న్ శుభ‌వార్త‌

Janasena: జ‌న‌సేన పార్టీకి కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి బిగ్ రిలీఫ్ అందింది. గాజు గ్లాసు గుర్తు జ‌న‌సేన‌కు మాత్ర‌మే కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. గ‌తంలో గాజు గ్లాసు గుర్తు ఉచితం కావ‌డంతో.. చాలా పార్టీలు అదే గుర్తు కావాల‌ని విజ్ఞ‌ప్తి చేసాయి. ఇందుకు ఎన్నిక‌ల క‌మిష‌న్ కూడా అంగీక‌రించ‌డంతో జ‌న‌సేన‌కు పెద్ద షాక్ త‌గిలిన‌ట్లు అయ్యింది. ఇప్పుడు ఆ గాజు గ్లాసు గుర్తును జ‌న‌సేన‌కు మాత్ర‌మే కేటాయిస్తున్న‌ట్లు ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించ‌డంతో జ‌న‌సేన పార్టీ ఊపిరి పీల్చుకుంది.