Vijaya Sai Reddy: ఆనాడు ఇవ్వ‌లేనివి ఇప్పుడెలా ఇస్తారు?

Vijaya Sai Reddy: గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu) అధికారంలో ఉండి కూడా హామీలు ఇస్తే ప్ర‌జ‌లు న‌మ్మ‌లేద‌ని.. ఇప్పుడు కూట‌మి క‌ట్టి మ‌రీ హామీలు ఇస్తే మాత్రం ప్ర‌జ‌లు ఎలా న‌మ్ముతార‌ని ప్ర‌శ్నించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి.

“” చంద్రబాబును సూటిగా ఓ ప్రశ్న అడుగుతున్నా. 2019 ఎన్నికల్లో మీరు అధికారంలో ఉండి పోటీ చేశారు. విచ్చలవిడిగా డబ్బు వెదజల్లారు. మీకు కాపలా కాసే పార్టీలు విడివిడిగా పోటీ చేసినా ఆయా పార్టీల బి-ఫారాలు మీరు చెప్పిన వాళ్లకే అందాయి. ఇంత చేస్తే మీరు గెలిచింది 23 అసెంబ్లీ స్థానాలు. 3 లోక్‌సభ సీట్లు. ఈసారి బహిరంగంగా పొత్తు కట్టారు సరే. ప్రజలను కన్విన్స్ చేయడానికి అప్పడు ఇవ్వలేనివి ఇప్పుడేమి ఇస్తారు? “” అని ట్వీట్ చేసారు.