సాక్షి రిపోర్ట‌ర్‌కు క్లాస్ పీకిన సునీతా రెడ్డి

YS Sunitha Reddy: వైఎస్ సునీతా రెడ్డి సాక్షి రిపోర్ట‌ర్‌కు క్లాస్ పీకారు. త‌న తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి మ‌ర‌ణం గురించి ఈరోజు ఆమె మ‌ళ్లీ మీడియాకు ప్ర‌జేంటేష‌న్ వేసి చూపించారు. వివేకా హ‌త్య‌కు గురైన‌ప్పుడు సాక్షి టీవీలో పదే ప‌దే గుండెపోటుతో చ‌నిపోయాడ‌ని రాసార‌ని సునీత ఆరోపించ‌గా.. వెంట‌నే అక్క‌డే ఉన్న ఓ సాక్షి రిపోర్ట‌ర్ స్పందించారు. మేడం.. సాక్షిలోనే కాదు. చాలా ఛానెల్స్‌లో గుండెపోటు అనే రాసారు క‌దా. మ‌రెందుకు సాక్షినే టార్గెట్ చేస్తున్నారు అని ప్ర‌శ్నించాడు.

ఇందుకు సునీత స్పందిస్తూ.. చాలా మంది రాసారు కానీ ఆయ‌న హ‌త్య‌కు గుర‌య్యారు అని తెలిసిన మ‌రుక్ష‌ణ‌మే అంద‌రూ క‌రెక్ట్ చేసుకున్నార‌ని.. కానీ సాక్షి మాత్రం గుండెపోటుతోనే అని ప‌దే ప‌దే చెప్పింద‌ని అన్నారు. ఆ త‌ర్వాత మ‌రో విలేక‌రి అడిగిన ప్ర‌శ్న‌కు సునీత స‌గం ఇంగ్లీష్‌లో స‌గం తెలుగులో స్పందిస్తుండ‌గా.. ఆమెకు అడ్డుప‌డి.. మేడం తెలుగులో చెప్పండి. ఎందుకంటే ఇక్క‌డ చాలా మందికి ఇంగ్లీష్ అర్థంకాదు అన్నారు. దాంతో సునీత‌కు ఒళ్లు మండింది. మీరు సాక్షి రిపోర్ట‌ర్ క‌దా.. నేను మాట్లాడుతున్న‌ప్పుడు ద‌య‌చేసి అడ్డుప‌డ‌కండి అని నోరు మూయించారు.

ALSO READ: Sunitha Reddy: నాన్న‌తో నాకు విభేదాలున్నాయ్