11 పెళ్లిళ్లు.. 12వ భార్య హ‌త్య‌

ఝార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. తాగుడు వ‌ద్దు అని చెప్పినందుకు ఓ వ్య‌క్తి క‌ట్టుకున్న భార్య‌నే చంపేసాడు. పైగా ఆమె 12వ భార్య కావ‌డం గ‌మ‌నార్హం. బొకారో ప్రాంతానికి చెందిన రామచంద్ర తురి 11 సార్లు పెళ్లి చేసుకున్నాడు. అత‌ను మ‌ద్యానికి బానిస అవ‌డంతో భ‌రించ‌లేక ఆ 11 మంది భార్య‌ను వ‌దిలేసి వెళ్లిపోయారు. దాంతో రామ‌చంద్ర సావిత్రి దేవి అనే మ‌హిళ‌ను 20 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి న‌లుగురు సంతానం. ఎప్ప‌టిలాగే నిన్న రాత్రి రామ‌చంద్ర పీక‌ల‌దాకా తాగి ఇంటికి వ‌చ్చాడు. దాంతో సావిత్రి అత‌నితో త‌గువుపెట్టుకుంది. కోపంతో రామ‌చంద్ర క‌ర్ర‌తో ఆమెను చిత‌క‌బాదాడు. ఆమె స్పృహ‌త‌ప్పి ప‌డిపోయినా కూడా కొడుతూనే ఉన్నాడట‌. పిల్ల‌లు ఇంటికి వ‌చ్చి చూడ‌గానే త‌మ త‌ల్లి ర‌క్త‌పుమ‌డుగుల్లో ప‌డి ఉండడంతో కేక‌లు వేసారు. స్థానికులు వ‌చ్చి చూసి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. సావిత్రి పంచాయ‌త్ స‌భ్యురాలిగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.